తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి లంచాల బాగోతం వెలుగులోకి వచ్చింది. కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు అనుకూల రిపోర్టులు ఇచ్చేందుకు ఆయన డబ్బు, బంగారం స్వీకరించినట్లు సిట్ విచారణలో అంగీకరించారు. మరోవైపు.. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టేసింది. హవాలా మార్గంలో జరిగిన ఈ లావాదేవీలపై సిట్ లోతైన విచారణ జరుపుతోంది.