కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లను ఈ డిప్ ద్వారా కేటాయిస్తున్నారు. మొదటి మూడు రోజుల టోకెన్లను ఈ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ డిప్ రిజిస్ట్రేషన్ కోసం భారీ స్పందన వచ్చింది. ఏకంగా 24 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనాలకు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ రెండో తేదీన ఈ డిప్ తీసి.. టోకెన్లు కేటాయిస్తారు.