Tirumala TTD Deepavali Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా జరిగింది. మలయప్పస్వామి, భూదేవి, శ్రీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నూతన వస్త్రాల సమర్పణతో ఆస్థానం పూర్తయింది. మరోవైపు టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ఆస్థానం నిర్వహించారు. సోమవారం తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయాల్లోనూ దీపావళి ఆస్థానాలు వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు భక్తులు దీపావళి ఆస్థానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.