Tirumala Srivari Gaming App Tamilnadu: తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో రోబ్లెక్స్ సంస్థ గేమింగ్ యాప్ రూపొందించడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. మరోవైపు, లడ్డూ ప్రసాదం కొనుగోలులో భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపులతో కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ విధానానికి భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.