తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. డిసెంబర్ 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. ఈ కారణంగా డిసెంబర్ 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవను కూడా టీటీడీ రద్దు చేసింది.