సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తున్నారు. చలి తీవ్రతను లెక్కచేయకుండా వచ్చిన భక్తులకు వస్తున్నారు. కాగా, కనుమ పండుగ సందర్భంగా టీటీడీ.. గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా భక్తులకు గోసేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. గోవులకు స్వయంగా ఆహారం తినిపించే అవకాశం కల్పించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ తెలిపింది.