Tirumala PAC 5 Building Open September 25th: తిరుమల భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన పీఏసీ-5 భవనం సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ భవనంలో వసతి, అన్నప్రసాద వితరణ, కల్యాణకట్ట వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడ్డాయి. గరుడ సేవ రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.