శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. తిరుమలలో పాదరక్షల నిర్వహణ సమస్యకు పరిష్కారం చూపించింది. ఇందుకోసం క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. మొత్తం ఎనిమిది కౌంటర్లను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి మంగళవారం ప్రారంభించారు. దీని ద్వారా భక్తులకు పాదరక్షలను వేగంగా అందించేందుకు వీలవుతుందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఎక్కడపడితే అక్కడ చెప్పులు వదలకుండా ఈ కౌంటర్లలో అందించాలని సూచించారు.