Tirupati Sainagar Shirdi New Weekly Express: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతి నుంచి షిర్డీకి కొత్త ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు డిసెంబర్ 14 నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.. తిరుమల వెళ్లే భక్తులు గమనించాలి. అలాగే అనేక రైల్వే ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని.. రూ.6,700 కోట్లతో తిరుపతి జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యమని చెప్పారు.