తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ కానుకలు ఇవ్వొద్దు అని తెలిపింది. ఇంతకు ఎప్పుడంటే.. గొడుగుల ఉత్సవం సందర్భంగా. ఆ సమయంలో భక్తులు ఇచ్చే కానుకలు టీటీడీకి చెందవని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవ నాడు శ్రీవారికి అలంకరించే గొడుగులను చెన్నై నుంచి ఊరేగింపుగా తీసుకు వస్తారు. అలానే ఈ సంవత్సరం కూడా గొడుగుల ఉత్సవం నిర్వహించునున్నారు.