తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి వాహనసేవలను ఒకేరోజు చూసే అవకాశం లభించనుంది. జనవరి 25న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. రథసప్తమి నేపథ్యంలో ఏడు వాహన సేవలను ఒకే రోజు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమికి టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.