Rajahmundry To Tirupati Flight Service October 1st: దసరా పండుగకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త! అక్టోబర్ 1 నుంచి రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. అలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ ఈ సర్వీసును వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శని) నడపనుంది. తిరుపతి నుంచి ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 9.25 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుంది. తిరిగి రాజమహేంద్రవరం నుంచి ఉదయం 9.50 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.