Tirumala Divyanugraha Homam February 2026 On January 27: ఫిబ్రవరి నెలకు రూ.300 దర్శనం టికెట్లు లభించని వారికి టీటీడీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. రూ.1600తో టికెట్ కొనుగోలు చేస్తే ఇద్దరికి హోమంలో పాల్గొని, అనంతరం రూ.300 ప్రత్యేక దర్శనం పొందే అవకాశం ఉంటుంది. రథసప్తమి సందర్భంగా మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి వాహన సేవలను తిలకించారు.