Tirumala Chandrababu Naidu Family Rs 44 Lakhs Donation: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి లోకేష్ ,కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో చంద్రబాబు కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు.