తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

9 months ago 24
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అర్చకులు.. ఆమెకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అందించారు. అయితే, రాష్ట్రపతి పర్యటనలో ఓ ఇద్దరు చిన్నారులు హడావుడి చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా వారిని ఏం అనకుండా.. సరదాగా వారిని దగ్గరకు తీసుకుంది. ఈ దృశ్యాలు అందర్ని ఆకర్షించాయి. కానీ, తిరుమల దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ద్రౌపదీ ముర్మకు అటు.. ఇటు ఆ ఇద్దరు చిన్నారులే అల్లరి చేస్తూ ఉండటం గమనార్హం. అయితే, రాష్ట్రపతితో పాటు కుటుంబసభ్యులు కూడా దర్శనం చేసుకున్నట్టు సమాచారం.
Read Entire Article