Record Level Donations To TTD Trusts: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందించారు. గత 11 నెలల్లో రికార్డు స్థాయిలో రూ. 918.6 కోట్లు వచ్చాయి. అన్నప్రసాదం, శ్రీవాణి ట్రస్ట్లకు అత్యధికంగా విరాళాలు అందాయి. ఆన్లైన్ ద్వారానే ఎక్కువమంది దాతలు విరాళాలు సమర్పిస్తున్నారు. మరోవైపు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంకటపాలెం ఆలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.