Chandrababu On Devotee Donated 121 Kgs Gold: వైఎస్సార్సీపీ నేతలు తిరుమల శ్రీవారి మహిమతో ఆడుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఒక జైన భక్తుడు 122 కిలోల బంగారాన్ని కానుకగా సమర్పించడాన్ని ఉదహరిస్తూ, స్వామివారి మహిమను, భక్తుల నమ్మకాన్ని ప్రస్తావించారు. అన్నప్రసాదం తయారీలో అధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, గత ప్రభుత్వం నాసిరకం భోజనం అందించడమే కాకుండా, పరకామణిలో చోరీలను సమర్థించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.