Gold Medallions Donated Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కానుకలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైకి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు కోటి రూపాయల విలువైన బంగారు పతకాలను సమర్పించగా, శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్ల విలువైన పతకాలు, వెండి తట్టలను విరాళంగా అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణకు ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా ఆలయానికి చేర్చింది. ఈ నెల 24న ధ్వజారోహణలో వీటిని వినియోగిస్తారు.