Tirumala Hundi Income Rs 137 Crores In August 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి ఆగస్టు నెలలో కూడా భక్తులు పోటెత్తారు. ఆగస్టు నెలలో ఏకంగా 24.56 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్నకు హుండీ ద్వారా 137.44 కోట్ల భారీ ఆదాయం వచ్చింది. మొత్తం 1.30 కోట్ల లడ్డూలను విక్రయించారు. ఆగస్టు నెలలో మూడుసార్లు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు దాటడం మరో విశేషం.