Two Cars Donated To Ttd: తిరుమల శ్రీవారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ విరాళాలు అందిస్తున్నారు. ఇటీవల ఇద్దరు భక్తులు రూ.10 లక్షలు, రూ.9 లక్షల విలువైన రెండు కార్లను టీటీడీకి కానుకగా ఇచ్చారు. గతంలోనూ పలువురు వాహనాలను విరాళంగా ఇచ్చారు. అలాగే, ట్రస్టులకు కూడా భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. మంగవారం నాడు తమిళనాడుకు చెందిన భక్తురాలు టీటీడీ ట్రస్టులకు రూ.కోటి విరాళం అందించి సంగతి తెలిసిందే.