Tirumala Devotee Donates Rs 1 Crore To Ttd: తిరుమల శ్రీవారికి భక్తులు తమ మొక్కులను విరాళాల రూపంలో చెల్లిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఎం. సౌమ్య అనే భక్తురాలు రూ. కోటి విరాళం అందించారు. ఇందులో రూ. 50 లక్షలు నిత్యాన్న ప్రసాదానికి, మరో రూ. 50 లక్షలు ప్రాణదాన ట్రస్టుకు ఇచ్చారు. మరోవైపు, బీహార్లోని పాట్నాలో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.