Tirumala Rs 50 Lakh Donation To TTD : తిరుమల శ్రీవారికి భక్తులు భారీ విరాళాలు అందిస్తున్నారు. చెన్నైకి చెందిన దాత రూ.50 లక్షలు, బెంగుళూరు సంస్థ రూ.10 లక్షలు, శివకాశి సంస్థ రూ.10 లక్షలు, గుంటూరు విద్యా సంస్థల అధినేత రూ.కోటి విరాళాలు ఇచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 8 లారీల ఎండుగడ్డిని గోశాలకు అందించారు. ఇలా ఎన్నో దానాలు తిరుమల శ్రీవారి ట్రస్టులకు చేరుతున్నాయి.