టీటీడీకి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన ఓ సంస్థ కోటి రూపాయలు విరాళంగా అదించింది. సుబ్బరావు అపారల్స్ అనే సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించింది. విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి దాత రాజా రమేష్ ఆదివారం అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు