irumala Donation of Rs.1.01 Crore To TTD: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.. వారు తమకు తోచిన విధంగా కానుకలు, విరాళాలు అందిస్తున్నారు.. రెండు రోజులుగా టీటీడీకి భారీగా విరాళాలు అందాయి.. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంనకు చెందిన తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ దంపతులు రూ.కోటి ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్, అదనపు ఈవోకు డీడీని అందజేశారు.. దాతల్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు.