Tirumala Sri Lankan Devotee Donated Rs 1 Crore: తిరుమల శ్రీవారికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పది రోజులు (నేటితో కలిపి)గా శ్రీవారికి దాదాపు రూ.29 కోట్ల వరకు విరాళాలు అందాయి.. ఇవాళ మరో ముగ్గురు భక్తులు విరాళాలను అందజేశారు. చెన్నైకు చెందిన కుటుంబం రూ.కోటి, శ్రీలంకకు చెందిన భక్తుడు మరో రూ.కోటి, నోయిడాకు చెందిన మరో కంపెనీ రూ.45 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్కుల్ని టీటీడీ ఛైర్మన్కు అందజేశారు.