Hyderabad P L Raju Donated Rs 2.50 Crore To TTD: హైదరాబాద్కు చెందిన పీఎల్రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ తిరుమల శ్రీవారి ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ ఒకరోజు అన్నదానానికి రూ.44 లక్షలు ఇచ్చారు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు జరగనున్నాయి.