Heavy Traffic Jam at Alipiri: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినా భక్తులు పోటెత్తడంతో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు ఆరు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తనిఖీ కేంద్రంలో సిబ్బంది కొరత కారణంగానే ఈ సమస్య తలెత్తిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ పరికరాలు, సిబ్బందిని పెంచాలని కోరుతున్నారు.