Hisar Tirupati Special Train 04717: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 9 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. తిరుపతి-హిసార్, నరసాపూర్-తిరువణ్ణామలై, కాచిగూడ-తిరుపతి మధ్య మొత్తం 48 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. రైలు ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.