Viskhapatnam Tirupati 08548 Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఆంధ్రప్రదేశ్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించారు. అంతేకాదు, మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించారు. విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-విశాఖపట్నం, విశాఖపట్నం-చర్లపల్లి రైళ్ల గడువు పొడిగించబడింది. వాల్తేర్ డివిజన్లో భద్రతాపరమైన పనుల కారణంగా కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.