తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కేవలం 2 రోజులు మాత్రమే నిర్వహించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రం ప్రకారం.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని ఓ స్వామీజీ టీటీడీకి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 రోజులకు పెంచారని.. అయితే ఇలా చేయడం వల్ల భక్తులకు, ఆలయ వర్గాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఇప్పటికే దీనిపై టీటీడీ సమాలోచనలు జరుపుతోంది.