Tirumala Srivani Tickets online Current Booking: తిరుమలలో శ్రీవాణి దర్శనం ఆఫ్లైన్ టికెట్ల జారీకి సంబంధించి నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకూ ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న శ్రీవాణి దర్శనం టికెట్లను ఈ రోజు నుంచి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో భక్తులకు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఉంచగా .. కేవలం ఏడు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 800 శ్రీవాణి దర్శనం టికెట్లను టీటీడీ ఈ విధానంలో ప్రతిరోజూ జారీ చేయనుంది.