తిరుమల భక్తులకు ఇబ్బందులు తప్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వర్షాకాలంలో విరిగే పడే కొంచడరియల కారణంగా ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంటుంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రాక్ బోల్టింగ్ అనే టెక్నాలజీ సాయంతో ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది టీటీడీ.