Tirumala Hundi Rs 5 Crore Income: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల రద్దీని బట్టి టీటీడీ అన్ని రకాల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తోంది. శనివారం ఒక్కరోజే 88 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. AI టెక్నాలజీతో దర్శన సమయం తగ్గించి, 12 గంటల్లోపే దర్శనం కల్పిస్తున్నారు. జనవరి 8 వరకు ఇదే పద్ధతిలో దర్శనాలు కొనసాగుతాయి. ఆదివారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది.