Bhashyam Ramakrishna Rs 44 Lakhs Donated: ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తిరుమల శ్రీవారి అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం అందించారు. మరో భక్తుడు చింతల దివ్యాంత్ రెడ్డి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. నేడు వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో వార్షిక విశేష పూజ వైభవంగా నిర్వహించనున్నారు.