తిరుమలలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు లభించడం ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. మద్యం, మాంసంపై తిరుమలలో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పదుల సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు దొరకడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. టీటీడీ కూడా స్పందించింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటన వెనుక ఓ వైసీపీ నేతతో పాటుగా ఇద్దరు మీడియా ప్రతినిధుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.