TTD EO Inspects Alipiri Route: తిరుమలకు వచ్చే భక్తుల్ని చిరుత భయం వెంటాడుతుండటంతో టీటీడీ అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అటవీ శాఖతో కలిసి కాలిబాట మార్గంలో తనిఖీలు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అదనపు సిబ్బందిని నియమించనున్నారు. వన్యప్రాణుల కదలికలపై నిఘా ఉంచేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే మరింత భద్రత కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ కొన్ని కీలక సూచనలు చేసింది