తిరుమలలో పుష్పాలంకరణ వివాదం.. టీటీడీ సిబ్బంది తీరుపై బెంగళూరు దాత ఆగ్రహం

1 year ago 20
తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది తీరుపై సునీత గౌడ్ అనే దాత అసంతృప్తి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పుష్పాలంకరణ చేస్తే.. కనీసం సమాచారం ఇవ్వకుండా టీటీడీ సిబ్బంది తొలగించారని సునీతా గౌడ్ ఆరోపించారు. సుమారు కోటి రూపాయల వరకూ ఖర్చు చేసి.. పుష్పాలు, విగ్రహాలతో అలంకరిస్తే, కనీసం సమాచారం ఇవ్వకుండా విగ్రహాలను తీసి ట్రాక్టర్‌లో వేయడం ఏమిటని సునీత గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈ వ్యవహారంపై టీటీడీ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. చివరకు టీటీడీ అధికారులు సర్ది చెప్పటంతో శాంతించారు.
Read Entire Article