Boating In Tirumala Papavinasanam: తిరుమలలో పాపవినాశనంలో బోటింగ్ అంశంపై వివాదం రేగింది. భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు బోటింగ్ చేశారు.. వీరు కయాక్ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటు కోసమని ప్రచారం జరిగింది. ఈ విషయం బయటకు రావడంతో విమర్శలు రావడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు.. ఈ బోటింగ్ అంశంపై క్లారిటీ ఇచ్చారు.