TTD Plans Multi Level Car Parking In Tirumala: ఈ ఏడాది రథసప్తమికి రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వాహన సేవలను తిలకించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ సమస్య పరిష్కారానికి టీటీడీ చర్యలు చేపడుతోంది. భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, గత అనుభవాల ఆధారంగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. భక్తుల నుంచి వచ్చిన సూచనలతో టీటీడీ మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది.