తిరుమలలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. జనవరి 25వ తేదీ తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది. మరోవైపు రథసప్తమి నేపథ్యంలో తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేశారు. అలాగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. సుమారుగా రెండున్నర లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.