Theft in Tirumala vishnu nivasam: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్ భక్తులకు ఊహించని షాక్ తగిలింది. విష్ణు నివాసంలో బస చేసిన ఓ మహిళ మెడలోని 16 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురైంది. నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని ఆమె టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ విష్ణు నివాసంలో చోరీలు జరిగాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.