woman dies by stray dog attack ఒకప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన కుక్కలు ఇప్పుడు భయానకంగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో రేణమ్మ అనే మహిళ వీధి కుక్క దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయింది. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నగరాల్లోనే కాదు, గ్రామాల్లోనూ కుక్కల బెడద ఎక్కువైపోయింది. అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడాలని అంటున్నారు. ఆ వివరాలు..