మొంథా తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు.. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు పప్పు, నూనె, ఉల్లి, బంగాళాదుంపలు, చక్కెర ఉచితంగా పంపిణీ చేయనుంది. మత్స్యకారులకు అదనంగా బియ్యం ఇస్తోంది. కాగా, తుఫాన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైప, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.