compensation to farmers: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన 41,361 మంది రైతుల ఖాతాల్లో రూ.51.52 కోట్లు జమ చేయనుంది. 29 జిల్లాల్లోని 51,528 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెలలో కురిసిన వర్షాలకు సంబంధించిన నివేదికను కూడా ఆర్థిక శాఖకు పంపి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.