తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఇంటర్ బోర్డు రెండు రకాల టైం టేబుళ్లను సమర్పించింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఫీజును కూడా పెంచాలని బోర్డు ప్రతిపాదించింది.