తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు నాణ్యమైన చికిత్స అందించేలా ఈజేహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లను ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రాల్లో గుండె , మూత్రపిండాల సంబంధిత అత్యున్నత స్థాయి వైద్య సేవలను దశలవారీగా ప్రవేశపెట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఖైరతాబాద్, కూకట్పల్లి కేంద్రాల బాధ్యతలను నిమ్స్ ఆసుపత్రికి అప్పగించగా.. మిగిలినవి వైద్య విద్య విభాగం పర్యవేక్షణలో ఉంటాయి. మందుల కొనుగోలు ప్రక్రియను డిజిటలైజ్ చేయడంతో పాటు.. ఆన్లైన్ ద్వారా వైద్యుడి అపాయింట్మెంట్ తీసుకునేలా ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను సిద్ధం చేస్తున్నారు.