తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు రహదారి ప్రాజెక్టులకు అనుమతులు కోరారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ - మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ రహదారికి కూడా అనుమతులు కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారు.