తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అతనికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం, డిసెంబర్ 9న..

7 months ago 15
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల సమస్య కారణంగా న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నందున, పాత రిజర్వేషన్లతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. పార్టీ పరంగా 42 శాతం సీట్లను బీసీలకు కల్పిస్తారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్ట ముసాయిదాకు ఆమోదం లభించింది... త్వరలోనే బోర్డు ఏర్పాటు చేస్తారు. అందెశ్రీ కుమారుడికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం, ఎస్సారెస్పీ రెండో దశకు రాంరెడ్డి దామోదర రెడ్డి పేరు ఖరారు చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు.
Read Entire Article