తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై సమీక్షకు రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఆమోదం తెలిపారు. మేడారం జాతర కోసం శాశ్వత భవనాల నిర్మాణం, జంపన్న వాగుకు నీటి మళ్లింపు.. 2027 గోదావరి పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ములుగులో ఎత్తిపోతల పథకం, మెట్రో ఫేజ్-2 భూసేకరణకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.