తెలంగాణలో యాత్ర చేయాలని కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల మీదుగా ఈ యాత్రను చేపట్టాలని యోచిస్తున్నారు. ఇక ఈ నెలాఖరులోనే యాత్రను ప్రారంభించి.. ఫిబ్రవరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే తన తండ్రి కేసీఆర్ ఫోటో కాకుండా.. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్రకు సంబంధించిన పోస్టర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ను రేపు విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.